బాహుబలి మొదలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లు బద్దలు అవుతున్నాయి. వరుసగా సౌత్ చిత్రాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ స్పీడ్ తో దున్నేస్తూ వసూళ్ల పంటను ఇటు వైపుకి తెచ్చేస్తున్నారు. పుష్ప, కేజీఎఫ్ చిత్రాలు సైతం ఇదే ఫార్ములాను బాలీవుడ్ పై ప్రయోగించి గొప్ప ఫలితాలను అందుకున్నాయి. అయితే ఇపుడు మరో సౌత్ ఇండియన్ హీరో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కన్నేశాడు అంటున్నారు. అందులోనూ టాలెంటెడ్ యంగ్ హీరో కావడం తో బాలీవుడ్ పై ఇక బాదుడే బాదుడు అంటున్నారు. అయితే కరోనా తర్వాత సౌత్ చిత్రాలే బాలీవుడ్ లో బాగా ఆడుతున్నాయి లాభాలు తెచ్చిపెడుతున్నాయి అన్నది అందరికీ తెలిసిందే.

అయితే ఇటీవల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయియా-2 గొప్ప వసూళ్లను రాబట్టి బాలీవుడ్ ఖాతాలో లాభాలు చేర్చింది. ఇక జూన్ 3న విడుదల కాబోయే అక్షయ్ కుమార్ చిత్రం పృథ్వీరాజ్ సైతం బాక్సాఫీస్‌కు జోరు పెంచుతుందని భావిస్తున్నారు. కానీ అదే రోజు రిలీజయ్యే రెండు సౌత్ సినిమాల ధాటికి పృథ్వీరాజ్ నిలవగలదా అన్న సందేహాలు ఇపుడు ఎక్కువగా వినపడుతున్నాయి. వాటిలో ప్రధానంగా అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ చిత్రమే ఉంది. ఈ సినిమాపై ముందు నుండే మంచి అంచనాలు ఉన్నాయి, అందులోనూ నిజ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కావడం తో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఇంత భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం కి బాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్న నేపథ్యం లో ఈ సినిమా ముందు అక్షయ్ కుమార్ చిత్రం నిలుస్తుందా అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్న తరుణంలో ఈ సినిమా బాలీవుడ్ లోనూ దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు. ఇదే తరహాలో కమల్ సినిమా విక్రమ్‌కు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజే వినిపిస్తోంది. మరి ఈ సినిమాలకు పోటీగా నిలిచి పృథ్వీరాజ్ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు . మరి ఈ చిత్రాలు రిజల్స్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: