తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ షో ఇటీవల ఓటీటీ వెర్షన్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఓ టి టి సీజన్లో టైటిల్ విన్నర్ గా బిందుమాధవి నిలువగా.. రన్నరప్ గా అఖిల్ సార్ధక్ నిలిచాడు. ఇక ప్రస్తుతం టెలివిజన్ కు సంబంధించిన 6 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ 6వ సీజన్ కి సంబంధించిన టీజర్ ఇటీవల స్టార్ మా యూనిట్  విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. గత సీజన్లో లాగా కాకుండా ఈ సీజన్లో సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. 

గతంలో బిగ్ బాస్ 2 సీజన్ లో నూతన్ నాయుడు, గణేష్, సంజన వంటి కామన్ పీపుల్స్ కి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేయబోతోంది బిగ్ బాస్ టీం. ఇదిలా ఉండగా ఇకపై బిగ్బాస్ షో కి తాను యాంకర్ గా ఉండనని నాగార్జున అధికారికంగా తెలియజేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ అలాగే రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని ఇక 3 నుంచి మొన్న వచ్చిన ఓటీటీ వెర్షన్ కూడా నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తనకు రెస్ట్ కావాలని నాగార్జున చెప్పడంతో బిగ్ బాస్ టీం ఇప్పుడు నాగార్జున మాజీ కోడలు సమంతను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్6వ సీజన్ కి అక్కినేని మాజీ కోడలు సమంతను వ్యాఖ్యాతగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఇప్పటికే ఈ విషయమై సమంతతో సంప్రదిస్తే ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ తను ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది సమంత. ఇక తాజాగా తన ఇన్స్టాలో 'కమింగ్ సూన్' అని పరోక్షంగా బిగ్ బాస్ షో గురించి హింట్ ఇచ్చింది. ఇక గతంలో నాగార్జున అందుబాటులో లేనప్పుడు సమంత నాగార్జున ప్లేస్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆమె నాగచైతన్యతో విడిపోలేదు. అయితే అప్పుడు విడిపోయిన తర్వాత కూడా మళ్లీ తన మామ చేసే రియాలిటీ షోని సమంత తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వ్యాఖ్యగా సమంత తన మామ నాగర్జున ని మరిపిస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: