కాగా ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పృథ్వీ రాజ్ మూవీ కోసం అక్షయ్ కుమార్ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఈ సందర్బంగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశం లోని విద్యార్దులకు చరిత్ర గురించి తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో మొగలుల సామ్రాజ్యాలు, వారి యొక్క రాజుల గురించి, వారి వారసత్వం గురించి అనేక పాఠాలు ఉన్నాయి. కాని ఒక్క హిందూ రాజు గురించి ఇక్కడ ఏ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశం లేకపోవడం నిజంగా సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొగలుల గురించి గొప్పగా చెప్పారు సరే... వారి చరిత్రలను పిల్లల మెదడులోకి పంపుతున్నారు సరే...కానీ వారి గురించి ఉన్నట్లుగానే హిందూ రాజుల గురించి కూడా ఈతరం పిల్లలకు నేర్పించడం, తెలియచెప్పడం అవసరమే కదా అంటూ అక్షయ్ డిమాండ్ చేశారు.
దాంతో ఒక్కసారిగా అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. నిజమే కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు ఆలోచించలేదు అంటూ షాక్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హిందూ రాజులకు సంబంధించిన పాఠ్యాంశాలను తరగతి పుస్తకాల్లో కలపాలి అంటూ డిమాండ్ చేశారు. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు ఎందరి మనసుల్లో దాగున్న ప్రశ్న అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ యాంగిల్ లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి రేపు విడుదల కానున్న పృథ్విరాజ్ సినిమాను సక్సెస్ చేస్తారా లేదా అంది చూడాలి.