డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న సంగతి తెలిసిందే..ఈ చిత్రం కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది..ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను మైథలాజికల్ సబ్జెక్ట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది.


సినిమా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలో మెజారిటీ వర్క్ గ్రాఫిక్స్‌దే ఉండటంతో, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులకు మరింత జాప్యం కానుందట. దీంతో ఈ సినిమా నుండి అప్‌డేట్స్‌ను ఎప్పుడు వదులుతారా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ విషయంలో తాజాగా ఓ వార్త బీ-టౌన్‌లో వినిపిస్తోంది.



సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటిలో విడుదల చెయ్యరని టాక్..అక్టోబర్ 23న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట. ఆ రోజున ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆ రోజైతేనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సమంజసం అని.. అభిమానులకు ప్రభాస్ బర్త్ డే ట్రీట్ కూడా ఇచ్చినట్లు అవుతుందని వారు భావిస్తున్నారట. మరి ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కే ఇంత సమయం పడితే, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్, రిలీజ్ డేట్‌కు ఇంకెంత సమయం పడుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎప్పుడో మొదలుపెట్టిన ఆదిపురుష్ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. దీని పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: