ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ ప్రముఖ టాలీవుడ్ హీరోలతో వరుసగా సినిమాలను నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉండటం గమనార్హం.అయితే ఈ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కితే ఆ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ హీరోల అభిమానులు ఈ విషయంలో మైత్రీ నిర్మాతలపై చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇక పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఫుల్ రన్ లో ఏకంగా 160 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. అయితే రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.ఇక 199 రూపాయలు చెల్లించడం ద్వారా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడవచ్చు. ఇక అలాగే డబ్బులు చెల్లించిన తర్వాత 48 గంటల్లో ఈ సినిమాను ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. ఈ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ మైత్రి వారిని పచ్చి బూతులు తిడుతున్నారు.


సర్కారు వారి పాట మూడు వారాలైన మంచి డీసెంట్ వసూళ్లు సాధిస్తుంది. అయినా కానీ మైత్రి వారు ఇలా చెయ్యటంతో మహేష్ ఫ్యాన్స్ కి కోపం వచ్చి వారిని తెగ తిడుతున్నారు.అయితే ఈ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విధంగా తక్కువ సమయంలోనే ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ బ్యానర్ పై తెరకెక్కే సినిమాల థియేట్రికల్ కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే చాలానే ఉంది.ఇక మైత్రీ నిర్మాతలు ఇకపై తమ బ్యానర్ పై తెరకెక్కే సినిమాలను ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే మంచిదని  కూడా చెప్పవచ్చు. ఈ బ్యానర్ నుంచి ఈ నెల 10వ తేదీన అంటే సుందరానికి సినిమా కూడా రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: