మెగాస్టార్ చిరంజీవి తాజా గా నటించిన ఆచార్య ఫెయిల్యూర్ తో బాగా డిస్సపాయింట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక దానికి తోడు వరుస సినిమాల షూటింగ్స్ ప్రెజర్ తో బాగా ఇబ్బంది పడ్డారు.అయితే దాంతో భర్య సురేఖ తో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్ళారు మెగాస్టార్. కాగా గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు.ఇకపోతే వెకేషన్‌లో ఫుల్‌గా రిలాక్స్‌ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. తాజాగా ఇప్పుడు ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్ లో బోళా శంకర్‌,బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య, మోహన్‌రాజా డైరెక్షన్ లో గాడ్‌ ఫాదర్‌ సినిమాలు చేస్తున్నారు....

 చిరంజీవి. ఇకపోతే ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకున్నారు.ఇక ఈ సినిమాల షూటింగ్స్ విషయంలో కూడా మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.అయితే ఆచార్య ఫెయిల్యూర్ తో షాక్ తిన్నారు చిరంజీవి. ఇక ఎక్కడ పొరపాటు జరిగిందో అవి కరెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల దర్శకులకు కరెక్షన్స్ చెప్పి.. సినిమాలలో మార్పులు చేర్పుల బాధ్యత అప్పగించి చిరంజీవి ఫారెన్ ప్లైట్ ఎక్కారు.అయితే  అన్నీ సెట్ రైట్ అనుకున్నాక వరుసగా ఫ్రెష్ గా షూటింగ్స్ స్టార్ట్ చేసుకోబోతున్నారు మెగా టీమ్.

ఇకపోతే గాడ్‌ ఫాదర్‌ లోని ఓ సాంగ్‌ సీక్వెన్స్, బోళా శంకర్‌ షూట్, వాల్తేరు వీరయ్య ఫారిన్‌ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొంటారట. కగా  ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ఛలో, భీష్మ సినిమాల ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇక ఈమూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్.ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా దసరా బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోతే ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: