అక్కినేని
నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అందులో ఒకటి
బాలీవుడ్ సినిమా కాగా మరొకటి తెలుగు సినిమా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ
హీరో ఈ ఏడాది తొలి రోజులలోనే బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆరు నెలల్లోనే మూడు క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేయబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన థ్యాంక్యూ
సినిమా జూలై 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
అలాగే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన లాల్ సింగ్ చడ్డ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించాడు. వీటితో పాటు ఇదే ఏడాది ఓ వెబ్ సీరీస్ ద్వారా కూడా వస్తున్నాడు. ఈ వెబ్ డ్రామాను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ డ్రామా
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనుంది. ఈ సినిమాల తర్వాత
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో ద్విభాషా చిత్రాన్ని
నాగ చైతన్య చేస్తున్న విషయం తెలిసిందే .
ఈ
సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇటీవలే ఈ దర్శకుడు చేసిన మానాడు
సినిమా ను తెలుగు లో
రీమేక్ చేస్తున్నాడు అంటున్నారు. ఇంకొకవైపు చైతు
పరశురామ్ ప్రాజెక్టుకు సంబంధించిన
సినిమా ను కూడా లైన్ లోనే పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నారు. సర్కార్ వారి పాట
సినిమా మొదలైన కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు సర్కారు వారి పాట
సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చైతు తో సినిమాను ఏ విధంగా చేస్తాడు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే స్క్రిప్ట్ లో ముందు చెప్పిన మార్పులు చేయాలని ఈ దర్శకుడికి
నాగచైతన్య చూపిస్తున్నాడట. ఈ సినిమాలో
మాస్ ఎలిమెంట్స్ ను మరింతగా పెంచమని మార్పులు చెప్పారట. ఆ మార్పులు చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న
నాగచైతన్య హిట్ దర్శకుడి పై ఇలాంటి ప్రెషర్ పెట్టడం దీనికి కారణం అవుతుందో చూడాలి.