యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు పెంచేశారు కొరటాల శివ. సినిమా నుండి వదిలిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. ట్రిపుల్ ఆర్ లానే పన ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది.

ఈ సినిమాకు మొదట్లో టైటిల్ గా రేడియేటర్ అని పెడుతున్నారని అన్నారు. కానీ లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ 31వ సినిమా టైటిల్ గా అసురుడు లేదా అసుర అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. అసుర సినిమా ఆల్రెడీ నారా రోహిత్ హీరోగా ఒక సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా కేవలం తెలుగులోనే వచ్చింది కాబట్టి పెద్దగా ప్రాబ్లెం ఏమి లేదు. అసుర టైటిల్ తో తారక్ రాబోతున్నాడని తెలుస్తుంది. ఇదే ఫిక్స్ అయితే నందమూరి ఫ్యాన్స్ కే కాదు ఆడియెన్స్ కు సూపర్ ఫీస్ట్ అందించడం పక్కా అని చెప్పొచ్చు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్న తారక్ ఆ మూవీని 2022 ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ మూవీ 2023 స్టార్టింగ్ లోనే మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ప్రశాంత్ నీల్ ఈలోగా సలార్ సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. తప్పకుండా ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ మరో అద్భుతాన్ని సృష్టిస్తాడని చెప్పుకుంటున్నారు. మరోపక్క కె.జి.ఎఫ్ 3 సినిమా కూడా చేసే ఆలోచనలో ఉన్న ప్రశాంత్ నీల్ ముందు తారక్ సినిమా చేస్తాడా లేక కె.జి.ఎఫ్ 3 మీద ఫోకస్ పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: