సినిమా ఈవెంట్ లాంచ్, లేదా మరే ఇతర ఈవెంట్ లు జరిగినప్పుడు ప్రమాదాలు జరగడం కామన్.. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి.వాటి గురించి ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి.తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.. రానా, సాయి పల్లవి జంటగా నటించిన  సినిమా విరాటపర్వం. ఈ సినిమా షూటింగ్ పనులకు ముగించుకొని విడుదల కు సిద్దంగా వుంది.ఈ మేరకు ఈ సినిమాకు సంభందించిన ఈవెంట్ ను నిర్వహించారు.


ఆదివారం కర్నూలు లో నిర్వహించిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలి పోయింది. భారీగా వీచిన ఈదురు గాలుల ప్రభావంతో స్క్రీన్ కూలినట్లు నిర్వాహకులు చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. చిత్ర హీరో రానా, హీరోయిన్ సాయి పల్లవి, ఇతర టెక్నీషియన్స్ వేదిక వద్దకు చేరడానికి ముందే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం గాలి బీభత్సం ఎక్కువగా ఉండటం తో వేదిక వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారు.



స్టేడియం అంతా చీకటి అలుముకుని ఉంది. ఘటన జరిగే సమయానికి స్టేజిపై ఉన్న గాయనీ, గాయకులను నిర్వాహకులు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఇదే సమయం లో వర్షం కూడా మొదలైంది. దీంతో కార్యక్రమం నిలిచిపోయింది. చివరకు కొందరు అభిమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు, నిర్వాహకులు అందరినీ సురక్షితంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాంతో ఎటువంటి ప్రమాదం జరగలెదని పోలీసులు చెబుతున్నారు.. దాంతో సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై అంచనాల ను పెంచాయి.. రానా కు బెస్ట్ సినిమగా ఈ సినిమా నిలుస్తుందని అందరు భావిస్తున్నారు. మరి ఎంత హిట్ ను అందుకుంటుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: