తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి వరుణ్ తేజ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటగా లోఫర్ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈమె అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ధోని సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.దీంతో బాలీవుడ్ కు కూడా బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఒకవైపు తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మరొకవైపు గ్లామర్ పాత్రలు కూడా పోషిస్తోంది దిశా పటాని.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నట్లుగా సమాచారం. ఎంతోమంది నటీమణులు ఏదో అవ్వాలని మరేదో అవుతూ ఉంటారు అని పలుసార్లు తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా ఈ విషయాన్ని తెలియ జేసింది. తన కెరియర్ లో ఈమె పైలెట్గా స్థిరపడాలని అనుకున్నదట. అనుకోని పరిస్థితులలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్ట వలసి వచ్చిందని తెలియజేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాని తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

ఇక తనని ఎక్కువగా పటని అని పిలవడం అస్సలు నచ్చదని.. దిశా పట్ని అని తన పేరును తెలియజేసింది. తన పేరు ఇదే అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు వినట్లేదని తెలియజేసింది. సంపద కోసం కమర్షియల్ యాడ్ లలో నటించే దాన్ని క్రమక్రమంగా.. కెమెరా కే ఆకర్షితురలయ్యానని తెలియజేసింది. డైట్ ను తప్పకుండా ఫాలో అవుతాను అని చికెన్, స్వీట్ చూస్తే అసలు ఆగకుండా ఉండలేనని తెలియజేసింది. ఇక ఆదివారం ఒక్కరోజు మాత్రమే తన రూల్స్ ను బ్రేక్ చేస్తానని తెలుపుకు వచ్చింది దిశా పటాని. అయితే తన ఫిట్నెస్పై ఇంట్రెస్ట్ పెరగడానికి సల్మాన్ ఖాన్ జాకీచాన్ లతో కలిసి పని చేయడానికి ముఖ్య కారణామని తెలియజేసింది. వారిచ్చే టిప్స్ నేర్చుకుంటూ ఉంటాను అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: