టాలీవుడ్ లో వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే హీరోగా అడవి శేష్ కి గుర్తింపు పొందారు. కెరియర్ ఆరంభం నుండి సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ యంగ్ హీరోకి డిమాండ్ చాలా ఎక్కువే. తరచూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, మనసును తాకే స్టోరీలను మాత్రమే ఎంచుకుని మన్నలను పొందటంలో ఈ హీరో ఎపుడు ముందే ఉంటారు. అలా ఈ యంగ్ హీరో నుండి వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. అయితే ఇక తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్ కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 26/11 ముంబై ఉగ్రవాది దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటనకు గాను సినీ ప్రముఖులు , ప్రేక్షకులు, విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉగ్రవాది దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయారు అని,  అడవి శేష్ తప్ప ఇంకెవరు ఆ రోల్ లో అంతగా నప్పరేమో అని అంటున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను శేష్ వెల్లడించిన విషయాలు విశేషంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 2 సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో అడవి శేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిట్ 1 మంచి బ్లాక్ బస్టర్ ను అందుకోగా... ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది.  హిట్ 1 లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.... ఇప్పుడు సీక్వెల్ సినిమాలో అడవి శేష్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ఎపుడో మొదలయిపోయింది.

మేజర్ సినిమా వల్ల కొన్నాళ్ళు హిట్ 2ను పక్కన పెట్టగా, ఇపుడు ఆ సినిమా పూర్తి అయి అనుకున్న విజయాన్ని అందుకుంది.  మేజర్ రిలీజైన నేపథ్యంలో హిట్ 2 సెట్స్‌ పైకి వెళ్లేందుకు మళ్ళీ రూట్ క్లియర్ అయ్యింది అని అన్నారు.  ఈ క్రమంలో శేష్  మాట్లాడుతూ.. 'మొదటి హిట్ మూవీతో పోల్చితే రెండవ హిట్ అంతకు మించి ఉండబోతుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: