సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ మూవీ లో సముద్ర కని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట ఓవరాల్ గా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కొన్ని రోజుల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మొదట 'మురారి వా' అనే సాంగ్ చిత్ర బృందం సినిమాలో పెట్టాలి అనుకుంది. కాకపోతే చివరి నిమిషంలో ఈ మూవీ లో ఈ సాంగ్ ని అడ్ చేయకుండనే థియేటర్ లలో విడుదల చేశారు. కాకపోతే ఈ సినిమా విడుదల తరువాత ఈ పాటను సినిమా లో ఆడ్ చేయాలి అని చాలా మంది ఫ్యాన్స్ కోరడంతో ఈ సినిమాలో ఈ పాటను కొన్ని రోజుల క్రితమే చేర్చారు.

థియేటర్లలో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే థియేటర్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన ఈ సాంగ్ ఫుల్ వీడియో  విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం 11:07 గంటలకు 'మురారి వా' సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ మూవీ ని GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల తో కలిసి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: