కన్నడ వజ్రకాయ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నభా నటేష్. ఇక ఆ తర్వాత సుధీర్ బాబు తో కలిసి నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా పరిచయమైంది. అందం ,అభినయం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మడు టాలీవుడ్ లో బాగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో మాస్ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది నాభా నటేష్. ఆ తర్వాత వెంటవెంటనే పలు అవకాశాలు అందుకుంది. రవితేజ డిస్కో రాజా సాయి ధరంతేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ వంటి సినిమాలలో నటించింది.

ఈ సినిమాలు ఏవి ఈమెకు అంతగా కలిసిరాలేదు గత సంవత్సరం నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో చిత్రం లో బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.. దీంతో  దెబ్బకి ఈ అమ్మడికి అవకాశాలు దూరం అయి పోయాయి చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమెపై బ్యాడ్ మార్కు పడిపోయిందని చెప్పవచ్చు అందుకే ఈమె అవకాశాలు అడుగుతున్నా సరే ఈమెను వద్దని అంటున్నట్లు సమాచారం.

సరైన ఛాన్స్ ఇవ్వాలి కానీ ఈమె ఏ రేంజ్ లో అయినా సరే నటించడానికి సిద్ధమే అంటోంది. మరి నభ నటేషా కి అలాంటి ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉన్నది నా చేతిలో సినిమాలు లేక పోయినా తన రెగ్యులర్ గా అప్ డేట్ తో మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఈమె కాకుండా ఎంతో మంది హీరోయిన్లు సైతం ఒక సినిమాతో సక్సెస్ అయిన తర్వాత సినిమాలు ఫెయిల్యూర్తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ కూడా ఇలాగే అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: