మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ప్రారంభం సమయం నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో పెద్ద సక్సెస్ అందుకున్న చరణ్, ప్రస్తుతం చేస్తున్న శంకర్ మూవీతో కూడా మరొక భారీ సక్సెస్ కొట్టేలా ఎంతో కష్టపడుతున్నట్లు టాక్. కాగా ఎప్పుడో మెగాస్టార్ తో మూవీ చేయాల్సిన ఛాన్స్ మిస్ అయిన శంకర్, ప్రస్తుతం చరణ్ తో ఆ ఛాన్స్ దక్కడంతో మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్.

ఇక ఈ సినిమా యొక్క కథ, కథనాలు రామ్ చరణ్ ఇమేజ్ కి సరిపోయే విధంగా అలానే, తన మార్క్ స్టైల్ ఎక్కడా కూడా మిస్ కాకుండా దర్శకుడు శంకర్ ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. అయితే విషయం ఏమిటంటే, వాస్తవానికి చరణ్, శంకర్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని భావించిన యూనిట్, దానిని సమ్మర్ కి వాయిదా వేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే దానికి కారణం ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ ఆదిపురుష్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాలు ఉండడమేనని సమాచారం.

అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వస్తేనే కానీ నమ్మలేం అని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మెగాఫ్యాన్స్ ఈ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ నిజం అయితే, ఒకింత మెగా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: