టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ నటించగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించాయి. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన సర్కారు వారి పాట మూవీ రిలీజ్ తరువాత మంచి సక్సెస్ కొట్టింది. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక వడ్డీ వ్యాపారస్థుడిగా కనిపించగా సముద్రఖని విలన్ పాత్ర చేసారు. ఇక ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు సూపర్ స్టార్ మహేష్.

రాక్ స్టార్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా పక్కా యాక్షన్ తో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని తీయనున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, వాస్తవానికి ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ మూవీ, స్క్రిప్ట్ లేట్ గా పూర్తి కావడంతో త్వరలో పట్టాలెక్కనుందని ఇటీవల కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు హాలిడే కి జర్మనీ వెళ్లిన మహేష్ ని కలవడానికి ఇటీవల త్రివిక్రమ్ అక్కడికి వెళ్లి ఆయనకు ఫైనల్ నేరేషన్ ఇవ్వడం, అది సూపర్ స్టార్ కి ఎంతో నచ్చడంతో పక్కాగా షెడ్యూల్స్ అన్ని కూడా ఫిక్స్ అయినట్లు టాక్.

ముఖ్యంగా ఈ మూవీ జులై మొదటి వారంలో ఆరంభం కానుందని, కొంత భాగం విదేశాల్లో మరికొంత భాగం హైదరాబాద్ లో తెరకెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానున్నట్లు టాక్. కాగా తమ హీరో లేటెస్ట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అని ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి ఈ విధంగా గుడ్ న్యూస్ లభించినట్లే అని, హ్యాపీ గా వాళ్ళు రిలాక్స్ అవ్వొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: