అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె ఏమైపోతుందో అని అందరు అభిమానులు తెగ కలవరపడ్డారు. అయితే కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ వస్తోంది. వాస్తవానికి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా 'పుష్ప'.. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ కాకపోయినా కూడా ఊ అంటావా అంటూ హాట్ హాట్ అందాలతో ఊపేసి సమంత అందరిని అలరించింది. అలా ఆ స్పెషల్ సాంగ్ ఆమెకు ఆమె కెరీర్ కు ఎంతో ఉపయోగపడింది అని చెప్పొచ్చు.
ఇకపోతే ఆమె తమిళంలో ఇటీవల 'కణ్మణి రాంబో ఖతీజా' చిత్రంతో కూడా అందరిని అలరించింది. ఈ సినిమా లో ఆమె గ్లామర్ కు ప్రేక్షక లోకం ఫిదా అయిపొయింది అని చెప్పొచ్చు. గ్లామర్ పాత్రల్లో తనదైన సత్తా చాటే సమంత ఈ సినిమా లోనూ అందర్నీ అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు లో విజయ్ దేవరకొండ తో చేసే సినిమా ఒకటి కాగా హిందీ లో ఒకటి అలాగే తమిళ్ లో కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తుంది. అయితే అనూహ్యంగా ఆమెకు మలయాళంలోనూ సినిమా అవకాశాలు వాస్తు ఉండడం విశేషం.