అక్కినేని నాగచైతన్య ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఏకంగా రెండు సినిమాలలో నటిస్తున్న నాగ చైతన్య ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ తో నటించడానికి సిద్ధంగా అవుతున్నాడని అంటున్నారు. డీజే దిళ్లు సినిమా తో ప్రేక్షకులను ఎంతో అలరించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇటీవలే ఓ సినిమా కథ ను ఆయనకు చెప్పగా దానికి ఎంతగానో ఇంప్రెస్ అయిన చైతు ఆ దర్శకుడుతో సినిమా చేయడానికి ఒకే చెప్పేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య కు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత ఈ డీజే టిల్లు డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్యాంక్యూ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సరికొత్త కథాకథనాలతో తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ను బట్టి తెలుస్తుంది. టీజర్ తప్పకుండా ఈ సినిమా స్థాయి ని, అంచనాలను పెంచింది అని చెప్పొచ్చు. మరో వైపు ఈ దర్శకుడితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు నటించబోతున్నాడు.  దూత అనే టైటిల్ తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోగా చైతూ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అయన సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. పోయిన ఏడాది లవ్ స్టోరీ హిట్ తర్వాత చైతు కి మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. అందుకే క్రేజీ దర్శకులందరు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే తమిళ అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభు కూడా చైతు తో సినిమా చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే తప్పకుండ మంచి హీరో అవుతాడు అని చెప్పొచ్చు. మరి దర్శకుడు విమల్ కృష్ణ సినిమా కూడా ఓ మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: