ఉప్పెన భామ కృతి శెట్టి మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ పాపులర్ అయ్యింది. ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ గా కృతి శెట్టి అదరగొట్టేస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు కూడా హిట్ అవడంతో ఆమెది గోల్డెన్ లెగ్ అయ్యింది. ప్రస్తుతం ముగ్గురు హీరోల సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి ఈమధ్యనే కోలీవుడ్ నుండి సూపర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి.

సినిమా సెట్స్ మీద ఉండగానే మరో తమిళ సినిమాకు అమ్మడు సైన్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న ఈ అమ్మడు తమిళంలో కూడా బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో సూర్య సినిమా పూర్తి కాకముందే తనకు వచ్చిన మరో క్రేజీ ఆఫర్ కి ఓకే చెప్పింది. ఇంతకీ కోలీవుడ్ లో కృతి శెట్టికి వచ్చిన సెకండ్ ఛాన్స్ ఎవరిది అంటే.. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ధనుష్ హీరోగా అరుణ్ మాధేశ్వరన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.

తెలుగులో ఆల్రెడీ రామ్ ది వారియర్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి ఆ సినిమాలతో పాటుగా తమిళంలో కూడా వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. చూస్తుంటే తెలుగు తమిళ భాషల్లో అమ్మడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు. ఉప్పెనలో మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో ఆ సినిమాతో ఫుల్ మార్కులు కొట్టేసిన కృతి శెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. యువ హీరో సినిమా అంటే ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: