తెలుగు సినిమా ఇండస్ట్రీలో నమ్రతా శిరోద్కర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 1993లో మిస్ ఇండియా, మిస్ ఏసియా కు ఎంపిక అయింది నమ్రతా. ఆ తర్వాత ఒక బాలీవుడ్ మూవీ తో తన సినీ కెరీర్ ప్రారంభించింది. అలా దాదాపు 20కి పైగా చిత్రాలలో నటించింది ఇమే. ఇక కన్నడం మలయాళం వంటి భాషలలో కూడా పనిచేసింది. ఇక టాలీవుడ్ లోకి బి.గోపాల్ దర్శకత్వంలో వంశీ చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ , నమ్రతా మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త పెళ్లి వరకు దారి తీసింది.


2005 ఫిబ్రవరి 10 న ముంబై లో చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ తరువాత నటనకు గుడ్బై చెప్పి నమ్రతా ఇంటికే పరిమితమైంది. ఇక వీరిద్దరికీ గౌతమ్,సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అమృత ఒక వైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరొక వైపు మహేష్ బాబు సినిమాల డేట్స్, బిజినెస్  విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నిర్మించిన నిర్మాణ సంస్థను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారట.

అయితే నమ్రత రీఎంట్రీ ఇస్తోంది అని పలుసార్లు వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలను ఆమె ఖండిస్తూ వచ్చింది. రీ ఎంట్రీ పై మరొకసారి నమ్రతా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున హైదరాబాదులో తన స్నేహితులతో ప్రారంభించిన స్టైలింగ్ స్టోర్ ఆవిష్కరణ కు హాజరయ్యింది ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ అభిమానులు తెరపై మళ్లీ తనని చూడాలని అనుకున్నారని కానీ నేను వాళ్ళ చేస్తూనే ఉన్నానని.. తమ ఫ్యామిలీ చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు అదే నాకు చాలా సంతోషం కలిగిస్తోంది అందుచేతనే సినిమాల వైపు దృష్టి పెట్టలేదు అని తెలియజేసింది. దీంతో రీ ఎంట్రీ ఇవ్వాననే క్లారిటీ ఇచ్చింది నమ్రతా

మరింత సమాచారం తెలుసుకోండి: