సమంత విడాకులు ప్రకటన అనంతరం సమంత పై ఎక్కువగా సోషల్ మీడియా స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. దీంతో ఆమె చేసిన ఏ విషయాన్ని అయినా సరే హాట్టాపిక్గా మారెలా చేశారు. అయితే సమంత గత రెండు రోజుల నుండి ముంబై వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కాఫీ విత్ కరణ్ టాక్ షోలో ఈమె పాల్గొనడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో దర్శక, నిర్మాత అయిన కరుణ్ జోహార్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో కూడా బాగానే పాపులర్ అయ్యింది ఇప్పటికి ఆరు సీజన్లలో పూర్తి చేసుకొని.. ఏడో సీజన్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది.

అయితే ఇందులో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు కనిపిస్తూ ఉండేవారు కానీ తాజాగా ప్రచారం కానున్న సీజన్లో బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలను కూడా పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు సమాచారం. దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకువాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేశారట. ఇక ఇందులో భాగంగానే స్టార్ హీరోయిన్ అయిన సమంత కాఫీ విత్ కరణ్.. ఏడో సీజన్ లో పాల్గొనబోతున్నానది అంటూ అందుకోసమే ఆమె ముంబై కి వెళ్ళింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. కరణ్ జోహార్ ఎలాంటి ప్రశ్న అడుగుతారనే విషయంపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ షో లో ఎక్కువగా కొన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతారు అనే టాక్ కూడా ఉంది. ఒకవేళ ఇదే రీతిలో కరణ్ జోహార్ అడిగినట్లు అయితే ఖచ్చితంగా సమంత విడాకుల వ్యవహారం గురించి అడిగే అవకాశం ఉంటుందని  నెటిజన్లు భావిస్తున్నారు. సమంత జీవితంలో  విడిపోవడం అనేది చాలా కఠినమైన దశ కాబట్టి ఎక్కడికి వెళ్ళిన వీటి గురించి ప్రశ్నలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా కరణ్ జోహార్ కు అక్కినేని ఫ్యామిలీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పే సమంత విడాకుల వ్యవహారం మాత్రం ఇప్పటికీ చెప్పలేదు.మరి ఈ షో లోనైనా ఏమైనా చెబుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: