బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కరీనా కపూర్ కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈమె బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుకోవడమే కాకుండా ...ఆమె సినిమాలలో తన అందం,అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది.ఇకపోతే ఈమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కరీనాకపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలావుంటే కరీనా కపూర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక కరీనా కపూర్ ఎక్కువగా ఖరీదైనవి వస్తువులని వాడుతూ ఉంటుంది .

అయితే చాలా మంది హీరోయిన్ లు ఆన్‌ స్క్రీన్‌ అయినా ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు. ఇక అలాంటి వారిలో కరీనాకపూర్ కూడా ఒకరు.ఇకపోతే  మామూలుగానే హీరోయిన్లుపార్టీలకు ఈవెంట్లకు ఫంక్షన్లకు, బయటకు వెళ్లినా కూడా ఖరీదైన దుస్తులను ధరిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వారు ధరించిన దుస్తులపై వారి స్టయిల్‌ పై విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.కాగా  ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్‌ కూడా ఈ విమర్శల బారిన పడింది.ఇదిలావుండగా ఇటీవల కరీనా గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించడంతో,అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇక అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆ టీషర్ట్‌ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.ఇక అసలు విషయం ఏమిటంటే  కరీనా 40 వేలు పెట్టి కొనుకున్న టీ షర్ట్‌ అష్ట దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు నెటిజన్స్.అంతేకాదు  నీ టేస్ట్‌ ఏడ్చినట్లుంది..మేము 150 పెడితే మూడు టీషర్ట్స్‌ వస్తాయి..నువ్వు వేసుకున్నదానితో పోలిస్తే అవే చాలా బాగుంటాయి అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే  కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్‌ 50 కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: