గత కొన్ని సంవత్సరాలుగా లవ్ లో ఉంటూ వచ్చిన తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు విఘ్నేష్ శివన్ మరియు స్టార్ హీరోయిన్ నయనతార లు ఎట్టకేలకు ఈ రోజు మూడు ముళ్ళ బంధంతో భార్యా భర్తలు అయ్యారు. వీరిద్దరి పెళ్లి కోసం ఎంత మంది వెయిట్ చేశారు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా వీరి పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చినా అవేమీ నిజం కాలేదు. దీనితో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని సందేహం ప్రేక్షకుల మదిలో ఉండేది. ఈ రోజుతో అది కూడా తీరిపోయింది. ఈ రోజు ఉదయం 2.22 గంటలకు మహాబలిపురం లోని ఒక మంచి రిసార్ట్ లో అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు మరియు బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఈ వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే సినీ ప్రముఖులు వచ్చారని తెలుస్తోంది. వారిలో రజనీకాంత్, అజిత్, కార్తి, విజయ్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, డైరెక్టర్ అట్లీ ఇంకా పలువురు హాజరయి వారికి విషెస్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నెటిజన్ల మదిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు అంతగా వర్క్ ఔట్ అవడం లేదు. దీనికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఒకవేళ వర్క్ ఔట్ అయినా ఎక్కువ కాలం మాత్రం కలిసి ఉండరు. దీనికి తాజా ఉదాహారణ నాగచైతన్య మరియు సమంత లది చెప్పుకోవచ్చు. ఇక వీరు కాకుండా చాలా మంది ఇలా పెళ్లి చేసుకుని విడిపోయారు.

ఇపుడు విఘ్నేష్ మరియు నయనతార ల విషయంలో ఇలాంటిది ఏమైనా జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు వేరే ? పెళ్లయ్యాక సీన్ వేరే ? అన్నీ మారిపోతాయి. మరి ఇంతకు ముందు జంటల లాగా కాకుండా వీరు నిండు నూరేళ్ళు హాయిగా కలిసి ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: