సమంత మరియు  నాగ చైతన్య.. ఇద్దరూ  ఏం మాయ చేశావే సినిమాతో జంటగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే  మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ జంట ఒకరికొకరు పరిచయం చేసుకొని...వీరు దాదాపు పది సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు .  వీరు ప్రేమించుకున్న ట్లు ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఇకపోతే కొన్ని సినిమాల ద్వారా కలిసి జంటగా నటించి మరింత పాపులారిటీ ని సొంతం చేసుకున్నారు. అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు మాత్రమే కాదు. వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా హాజరై వేడుకను మరింత విజయవంతం చేశారు.  నాలుగు సంవత్సరాలపాటు క్యూట్ కపుల్ గా ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచిన ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా విడిపోతున్నాం అని ప్రకటించారు. 

అయితే నిజానికి సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా కథ ను వినిపించడానికి వెళ్ళినప్పుడు.. పిల్లలను కనడానికి ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపింది.అయితే నెలకే విడాకులు తీసుకుంటున్నారు అని ప్రకటించడం జరిగింది.ఇకపోతే  కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా సమంత వినకుండా బాలీవుడ్లో విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో రాజి పాత్రలో చాలా బోల్డ్గా అసభ్యకరంగా నటించడం వల్ల కుటుంబం పరువు పోయిందని....అంతేకాదు  అక్కినేని కుటుంబ వారసులు సమంతపై గట్టిగా అరవడం జరిగిందట.అయితే ఇలా మనస్తాపం చెందిన ఆమె కెరీర్ పై దృష్టి పెట్టాలన్నారు.  నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం జరిగింది.

అయితే కానీ తన భర్త ను వదులుకోలేక కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేక ఎంతో సతమతమయ్యింది. ఇకపోతే  తన మనసులో ఉన్న బాధ ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా పలు వీడియో లు , పస్టులు షేర్ చేసింది. ఈమె తన సినీ కెరీర్ లో బిజీగా ఉండడంతో నాగచైతన్యను మరిచిపోయిందని అందరూ అనుకున్నారు. కాగా  ఆమె నాగచైతన్యను మరిచిపో లేదని చెప్పవచ్చు. అయితే ....ఎందుకంటే నాగచైతన్య ప్రేమకు గుర్తుగా ఆమె నడుం పైన, చేయి పైన వేయించుకున్న టాటూలను ఇంకా తొలగించక పోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇక వీటిని బట్టి చూస్తే సమంత ఇంకా నాగచైతన్యని మర్చిపో లేదని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: