రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ గా ఇటీవల రాధేశ్యామ్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకడు. అయితే మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయింది. దానితో ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజక్ట్ కె మూవీస్ పై ప్రభాస్ గట్టిగా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

అయితే ఈ మూడు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా వీటిలో ముందుగా ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కనుకదాగా సమ్మర్ లో సలార్, అలానే వచ్చే ఏడాది చివర్లో ప్రాజక్ట్ కె విడుదలయ్యే ఛాన్స్ఉంది . అయితే విషయం ఏమిటంటే, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మెజారిటీ ఆడియన్స్ అందరిలో కూడా సలార్ మూవీ పై ఎన్నో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ మూవీని కెజిఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, సలార్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ మే నెలాఖరులో వస్తుందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కొన్ని కారణాల వలన అది జూన్ కి పడిందని కూడా వార్తలు రావడం జరిగింది. ఇక ఇప్పటికే జూన్ లో పది రోజులు గడవడంతో అసలు ఈ నెలలో అయినా తమ డార్లింగ్ మూవీ సలార్ ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఒకింత నిరాశగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కి మోక్షం ఎప్పుడో తెలియాలి అంటే స్వయంగా నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ వారు స్పందించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: