కమల్ హాసన్ కెరియర్ కు ఊహించని మలుపు తిప్పింది ‘విక్రమ్’ ఈమూవీ సాధించిన ఘన విజయంతో దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపడుతోంది. ఇప్పటికే 160 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈమూవీ 200 కోట్లు టార్గెట్ కు ఈవారంతానికి రీచ్ అవుతుంది అన్నసంకేతాలు వస్తున్నాయి. కమల్ హాసన్ కెరియర్ లోనే అత్యంత కలక్షన్స్ రాబట్టుకున్న మూవీగా ఇది ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈమూవీ క్లైమాక్స్ లో తమిళ హీరో సూర్య కనిపించింది కేవలం 5నిముషాలు మాత్రమే అయినప్పటికీ రోలెక్స్ పాత్రలో సూర్య నటించిన నెగిటివ్ పాత్రకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమూవీకి సంబంధించి సీక్వెల్ ఆలోచనలు కమలహాసన్ లోకేష్ కనకరాజ్ లకు రావడంతో ఈమూవీ సీక్వెల్ ను వీలైనంత త్వరలో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలి అన్న ఆలోచనలు కమల్ కు వచ్చినట్లు చెపుతున్నారు.


ఈమూవీ సీక్వెల్ లో ‘విక్రమ్’ మూవీలో చిన్నపిల్లవాడిగా కనిపించిన కమలహాసన్ మనవడి పాత్రను మరింత పెద్దదిగా మార్చి ఆ మనవడు పెద్దవాడు అయ్యాక ఏమైంది అన్న పాయింట్ చుట్టూ ఈ సీక్వెల్ కథ నడుస్తుంది అని అంటున్నారు. సీక్వెల్ లో కమల్ మనవడుగా రామ్ చరణ్ నటిస్తాడని అప్పుడే ప్రచారం మొదలైంది. ఇలా ఈ సీక్వెల్ చరణ్ నటించడం వల్ల ఈ సీక్వెల్ కు తెలుగు రాష్ట్రాలలో మంచి మార్కెట్ తో పాటు క్రేజ్ కూడ ఏర్పడుతుంది అన్న అంచనా ఏర్పడటంతో ఈ సీక్వెల్ కు చరణ్ ను రంగంలోకి దించుతున్నట్లు టాక్.


‘విక్రమ్’ మూవీ రజినీకాంత్ పూర్వ సినిమాల రికార్డులను కూడ బ్రేక్ చేయడంతో మరొక సాలిడ్ హిట్ పడితే చాలు. కమలహాసన్ తమిళ సినిమా రంగంలో తిరిగి తన నెంబర్ వన్ స్థానాన్ని పొందే అవకాశం ఉంది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. గత కొంతకాలంగా అజిత్ సూర్య కమల్ హాసన్ రజినీకాంత్ విక్రమ్ ధనుష్ ల సినిమాలు వరసగా ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో కోలీవుడ్ ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో విక్రమ్ ద్వారా కమలహాసన్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు తమిళ ఫిలిం ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: