తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన  సినిమా 'అంటే సుందరానికి' .ఇక ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.ఇకపోతే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించడం జరిగింది.అయితే మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అంతేకాదు మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానుంది.

ఇదిలావుండగా  ఈ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.అయితే తనను మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు రావాలని ఆహ్వానించినందకు థాంక్స్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్ర ఈవెంట్ లో తనకు సంబంధించిన ఏవీ వేయొద్దని చెప్పానని, అయినా వేశారని అన్నారు. ఇకపోతే తన ఏవీ వేయకపోతే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అలా చేసినట్లున్నారని పేర్కొన్నారు.అయితే నాని నటనతో పాటు తన వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టమని, ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

అంతేకాదు తన కుటుంబంలో చాలా మంది నాని అభిమానులున్నారని తెలిపిన పవన్ కల్యాణ్..తెలుగు చిత్ర పరిశ్రమ అందరి సొత్తు అని చెప్పారు. దీనితోపాటు ఆయన ....మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీ శ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చిత్ర షూటింగ్ త్వరలో స్టార్ట్ చేస్తామని తెలిపారు.ఇక హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే హీరోయిన్ గా తప్పుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ వెతుకులాటలో ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: