ప్రముఖ కన్నడ నటి రమ్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్య చిత్రం ద్వారా మొదటిసారిగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత తమిళం, కన్నడ వంటి డబ్బింగ్ చిత్రాలలో నటించి మరింత దగ్గరైంది. ముఖ్యంగా హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణ చిత్రంలో రమ్య నటనతో అందరిని ఆకట్టుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె రాజకీయాలలో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది. కాంగ్రెస్ ఎంపీగా పలు సేవలు అందించింది అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె మళ్ళీ తిరిగి రీఎంట్రీ సినిమాల్లోకి వస్తుందనే వార్తలు కూడా బాగా వినిపించాయి కానీ సినిమాలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న రమ్య సోషల్ మీడియాలో మాత్రం బాగానే ఉంటుంది. ఇక తన పర్సనల్ విషయాల తో పాటు ఫోటోలను కూడా తరచూ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే రమ్యకు సోషల్ మీడియాలో ఒక చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తన మిద ట్రోల్ చేస్తున్నారని అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్ లు కూడా పంపిస్తు కామెంట్స్ చేస్తున్నారని ఆమె బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్లు గా సమాచారం.

తాజాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ-777 చిత్రం ఈ రోజున విడుదల అయింది నిన్న ఈ సినిమా    ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అని ఒక నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రీతమ్ గతంలో కూడా తనకు కొన్ని అసభ్యకరమైన సందేశాలు పంపించాడని తరచూ తన మిద ట్రోల్ చేస్తున్నారని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: