పవన్ కళ్యాణ్ ఎవరితోనూ పెద్దగా సన్నిహితంగా ఉండడు. అయితే ఒకసారి సన్నిహితంగా ఉండటం మొదలుపెడితే తనకు తెలిసిన ఆ వ్యక్తి గురించి అన్ని విషయాలలో జాగ్రత్తలు చెపుతూ చాల క్లోజ్ గా ఉంటాడు. ఈవిషయాన్ని సుకుమార్ ఈమధ్య జరిగిన ‘అంటే సుందరానికి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు.


‘భీమ్లా నాయక్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను పవన్ ను కలిసానని సుమారు 20 నిముషాల పాటు చాల ఆప్యాయంగా పవన్ తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఆతరువాత దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఫోన్ చేసి పవన్ తో మాట్లాడుతున్నప్పుడు ‘ఆయాసపడుతూ మాట్లాడావట’ పవన్ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమన్నారు అంటూ చెప్పిన విషయాలను బయటపెట్టాడు.


అయితే తన ఆరోగ్యం బాగుండాలని హెల్త్ కోసం యోగ కూడ చేస్తున్నాను అంటూ పవన్ కు ఆ సభావేదిక నుండి చెపుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే సుకుమార్ మాటలకు కొందరు వేరే అర్థాలు వెతుకుతున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ ఆఫంక్షన్ లో అంత ఓపెన్ గా సుకుమార్ పవన్ కు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటూ మరికొందరు సుకుమార్ మాటలకు వేరే అర్థాలు వెతుకుతున్నారు.


ఈమధ్య సుకుమార్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్ళి కొన్ని వారాలు ఉండి వచ్చాడు. దీనితో పవన్ కు చెప్పినట్లుగా తన రెస్ట్ గురించి వెళ్ళాడా లేదంటే ‘పుష్ప 2’ గురించి వెళ్ళడా అంటూ మరికొందరి  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా పెద్దగా ఎవరి గురించి పట్టించుకోని పవన్ కళ్యాణ్ సుకుమార్ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం ఒక న్యూస్ అయితే ఆవిషయాన్ని అంత ఓపెన్ గా అందరికీ తెలిసే విధంగా ధైర్యంగా సుకుమార్ బయటపెట్టడం మరొక ట్విట్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నప్పుడు తన సినిమాలకు సంబంధించిన నటీనటులతో ఆ పాత్రల స్వభావాన్ని వివరిస్తూ చాల ఉద్వేగానికి లోనవుతాడు. అందువల్లనే సుకుమార్ కు ఒత్తిడి ఏర్పడింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: