సమంత తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తమన్నా లాంటి హీరోయిన్స్ అంతా తమ క్రేజ్ ను కోల్పోయి సీనియర్ హీరోయిన్స్ గా మారిపోయారు. అయితే సమంత మాత్రం పెళ్ళి చేసుకుని ఆతరువాత విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగ గలము అన్న సంకేతాలు ఇస్తోంది. అంతేకాదు ఆమె ‘పుష్ప’ లో చేసిన ఐటమ్ సాంగ్ తో మళ్ళీ సమంత పూర్తిగా ట్రాక్ లోకి వచ్చేసింది.


అప్పటి వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు మాత్రమే పరిమితమైన సమంత ఇప్పుడు గ్లామర్ షోకి కూడ ఓకె చెపుతోంది. దీనితో 30 సంవత్సరాలు దాటిపోయిన సమంతకు మళ్ళీ యూత్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో సమంతకు ఏర్పడిన క్రేజ్ ను తమకు అనువుగా మార్చుకోవడానికి కొన్ని కార్పోరేట్ సంస్థలు సమంతను తమ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్నాయి.


సమంత కూడ తనకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ అనేక మల్టీ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులలో సమంత తనకు వచ్చిన ఒక మల్టీ బ్రాండ్ ప్రమోటింగ్ అవకాశాన్ని వదులుకోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ శారీ షో రూమ్ తమ ఖరీదైన పట్టుచీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ ను తయారు చేయాలని ముందుకు వచ్చి ఆ యాడ్ లో నటించవలసిందిగా సమంత అదేవిధంగా రష్మిక లను అడిగినట్లు తెలుస్తోంది.


ఈ యాడ్ లో నటించినందుకు రష్మిక తో పాటు సమంతకు కూడ భారీ పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ ఆ ఆఫర్ కు సమంత నో చెప్పిందని తెలుస్తోంది. దీనికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ రష్మిక తో కలిసి ఆ యాడ్ లో కలిసి నటించడం వల్ల తనకు పెద్దగా క్రేజ్ రాదు సరికదా రష్మిక మ్యానియా ముందు తాను తెలిపోతానని సమంత భయపడిందా అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: