స్టార్ హీరోలు నటించిన సినిమా టీజర్ లకు , అలాగే స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన మూవీ టీజర్ లకు మరియు ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న కొన్ని మూవీ టీజర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం అనేది చాలా సర్వ సాధారణంగా జరిగే విషయం. ఇది ఇలా ఉంటే కొన్ని సినిమా టీజర్ లు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకొని కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. అయితే అందులో భాగంగా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 టాలీవుడ్ మూవీ టీజర్ ల గురించి తెలుసుకుందాం.

రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 42.67 మిలియన్ వ్యూస్ ని సాధించింది.


సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 23.06 మిలియన్ వ్యూస్ ని సాధించింది.


పుష్ప : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్  రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 22.52 మిలియన్ వ్యూస్ నిసాధించింది.


సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 14.64 మిలియన్ వ్యూస్ ని సాధించింది.


ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లోని  రామరాజు ఫర్ బీమ్ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 14.14 మిలియన్ న్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: