టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ 'చందమామ కథలు' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్, సిద్దు జొన్నలగడ్డ హీరోగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా గుంటూరు టాకీస్ సినిమాను తెరకెక్కించాడు. 

కాస్త బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు పెద్దగా మెప్పించలేక పోయింది.  గుంటూరు టాకీస్ మూవీ తర్వాత ప్రవీణ్ సత్తార్, రాజశేఖర్ హీరోగా గరుడ వేగ సినిమాను తెరకెక్కించాడు. గరుడ వేగ సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా ప్రవీణ్ సత్తార్ కు ఓటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా గరుడవేగ సినిమాతో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ప్రవీణ్ సత్తా ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయిక నటిస్తోంది. ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.  ఇది ఇలా ఉంటే ఘోస్ట్ మూవీ విడుదల కాకముందే ప్రవీణ్ సత్తార్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చేసుకున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా బయటకు వచ్చింది.  

ప్రవీణ్ సత్తార్ తాజాగా జీ 5 తెలుగు ది ఫిల్మ్ రిపబ్లిక్ తో చేతులు కలిపి కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. ఈ మూవీ కి ప్రణతి రెడ్డి నిర్మాతగా వ్యవహరించ నుండగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా ఈ మూవీ కి టైటిల్ ను ఖరారు చేయలేదు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: