ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌  హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా అసలు ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు.ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్లోగా రాబట్టిన కూడా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు రాబట్టి ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. దేశ వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రాంతం ఇంకా భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ డాన్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడన్న కథాంశంతో ఈ సీక్వెల్ అనేది తెరకెక్కుతోంది.పుష్ప పార్ట్‌1కి మంచి సీక్వెల్‌ ఉండేలా సుకుమార్‌ చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే షూటింగ్ విషయంలో సుకుమార్‌ బాగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇక సినిమాను కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేందుకు ఈ లెక్కల మాస్టర్‌ భారీ ప్లాన్‌ వేస్తున్నట్లు సమాచారం అనేది తెలుస్తోంది.


జూలై నెలలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని చూస్తున్నాడు. అలాగే 6 నెలలో అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ సుకుమార్‌ భావిస్తున్నాడు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో అనేది ఇంకా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఇదిలా ఉంటే పార్ట్‌1లో సమంత స్పెషల్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిన నేపథ్యంలో సుకుమార్‌ ఈసారి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని కూడా రంగంలోకి దింపుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కూడా ఇంకా ఎలాంటి ప్రకటనరాలేదు. మరి పుష్పతో వండర్స్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్ సుకుమార్‌ సీక్వెల్‌తో ఎలాంటి రికార్డులను బద్దలు కొడతాడో తెలియాంటే వచ్చే ఏడాది వరకు కూడా వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: