అల్లు అర్జున్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఊహించని విధంగా తెరకెక్కించి అద్భుతమైన స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై.. రూ.360 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్లో వంద కోట్లకుపైగా వసూలు చేసే ట్రెండ్ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం సీక్వెల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు అన్ని ఎక్కువగా మంచి వసూళ్లను రాబడుతున్నాయి.. అందుచేతనే పుష్ప -2 సినిమా విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు చిత్రబృందం.


స్క్రిప్ట్ నుంచి బడ్జెట్ వరకు అంత భారీగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నది ఈ చిత్రం జూలై ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-1  కంటే పుష్ప -2 కోసం దాదాపుగా రూ.400  కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం గమనార్హం. పార్ట్ 2 కోసం ఈ బడ్జెట్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడితో సినిమా చేస్తారా లేక బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఆ మధ్య సడన్గా ముంబైకి వెళ్లి అల్లు అర్జున్ బాలీవుడ్లో మంచి పేరున్న డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తో ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగానే బన్నీ త్వరలో ఆయనతో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు తో కాకుండా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: