రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ప్రభుత్వం వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లలో, పాన్ వరల్డ్ మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.  

ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ కే మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు . ఇందులో ఆది పురుష్, సలార్ సినిమాలు పాన్ ఇండియా మూవీ లుగా తెరకెక్కుతూ ఉండగా,  ప్రాజెక్ట్ కే సినిమా పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ఈ మూవీ లో ప్రభాస్ నటించబోతున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే కామెడీ థ్రిల్లర్ మూవీ లో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా , క్రేజీ దృష్ట్యా  ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమాకు దాదాపు 100 నుండి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం 100 నుండి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ కు కేవలం 5 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడట. తాను తీసుకున్న 5  లక్షల రెమ్యూనరేషన్ ఏమి చేశానో కూడా తెలియదు అని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈశ్వర్ సినిమాకు జయంత్ సి దర్శకత్వం వహించగా , ఈ సినిమా 2002 లో విడుదలైంది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: