సమంత తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. సౌత్ ఇండియన్ ఆడియన్స్ కు సమంత పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలో అగ్రహీరోయిన్ గా పేరు పొందింది సమంత. ఈమె కెరీర్ పరంగా ఎన్నో వ్యక్తిగత జీవిత సంబంధాల విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగ చైతన్య తో విడాకులు అనంతరం సమంత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంటోంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. దీంతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా పేరు సంపాదించింది.

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత పేరు బాగా కనిపిస్తూ ఉండటంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంది అటు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. ఎన్నో విషయాలు మాటల్లో చెప్పలేని విషయాలను యొక్క ఫోటోతో చెప్పవచ్చు అని తెలియజేసింది. సోషల్ మీడియాలో సైతం పలు ఫోటోలను వీడియోలను షేర్ చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలియజేసింది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో నేరుగా కనెక్ట్ కావచ్చు అని ఆమె ఉద్దేశమట.


అయితే నెగిటివ్ కామెంట్స్ రోల్ విషయంలో మొదట్లో చాలా బాధ పడే దానిని కానీ ఆ బాధతో రాత్రి సమయాల్లో ఎక్కువగా నిద్ర పోకుండా ఉండే సందర్భాలు ఉన్నట్లుగా తెలియజేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ అలవాటు అయిపోయాయని. వాటిని పట్టించుకోవడం అసలు మానేశానని అయితే నిజమైన అభిమానులు చేసే సద్విమర్శలను మాత్రం స్వీకరిస్తారని తెలియజేసింది. వాటికి తగ్గట్టు గానే నన్ను నేను మార్చుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను అని సమంత ఈ సందర్భంగా తెలియజేసింది. సమంత ప్రస్తుతం యశోద, ఖుషి, శాకుంతలం వంటి సినిమాలతో బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: