ప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమలో ఉన్న కథానాయికల్లో ఎక్కువ ప్రేక్షకాభిమానం పొందుతున్న వారిలో సాయి పల్లవి ఒకరు. మళయాళ ప్రేమం సినిమా తో సౌత్ లో సూపర్ పాపులర్ అయిన ఆమె ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా నుండి ఆమె చేస్తున్న ప్రతి సినిమా తెలుగులో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. చేస్తున్న పాత్ర ఏదైనా సరే సాయి పల్లవి ప్రాణం పెట్టేస్తుంది. ఆ పాత్రకి కావాల్సిన కష్టం పడుతుంది. అందుకే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ఏర్పడింది.

లాస్ట్ ఇయర్ శ్యాం సింగ రాయ్ సినిమాలో రోజీ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి త్వరలో విరాటపర్వం సినిమాలో వెన్నెలగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనతో మరోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు. సినిమా అంతా కూడా సాయి పల్లవి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందట. విరాటపర్వం ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీగా చిత్రయూనిట్ చెబుతున్నారు. రానా ఈ సినిమాలో ఒక పాత్ర చేశాడంతే తప్ప సినిమా మొత్తం సాయి పల్లవిదే అంటున్నారు.

ఇక కొంతమంది సాయి పల్లవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే విరాటపర్వం సినిమాతో సాయి పల్లవికి నేషనల్ అవార్డ్ సైంతం వచ్చేస్తుందని అంటున్నారు. జస్ట్ విరాటపర్వం ట్రైలర్ చూసే ఆడియెన్స్ ఈ నిర్ణయానికి వచ్చేశారు. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ అవనుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. అయితే ఇప్పటికే సినిమా చూసిన కొందరు సినీ సెలబ్రిటీస్ విరాటపర్వం సినిమా గురించి స్పెషల్ గా చెబుతున్నారు. మరి అందరు కోరుతున్నట్టుగానే సాయి పల్లవికి ఈ సినిమా నేషనల్ అవార్డ్ తెస్తుందా లేదా అన్నది చూడాలి. రానా మాత్రం విరాటపర్వంలో వెన్నెల పాత్ర సాయి పల్లవి తప్ప మరెవరు ఆమెలా చేయలేరని చెప్పేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: