బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ లో మినిమమ్ గ్యారేంటి హీరో. పెద్ద పెద్ద రికార్డ్స్ లేకపోయినా కానీ ఖాన్స్ కి ధీటుగా బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. కానీ గత కొంతకాలం నుంచి కూడా అక్షయ్ కి వరుస ప్లాపులు క్యూ కడుతున్నాయి. ఇక తాజాగా అక్షయ్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ 'పృథ్వీరాజ్'.జూన్ 3 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అప్పట్లో ఢిల్లీని పాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథతో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రమిది. రిలీజ్ రోజున ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ నే రాబట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ వారం రోజులు కూడా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ అసలు నిలబడలేదు. నిన్న నార్త్ లో కొన్ని థియేటర్లో ఈ చిత్రం షోలను కూడా రద్దు చేశారు.ఇక అందుకు ప్రధాన కారణం థియేటర్లలో జనం లేకపోవడమే అని సమాచారం తెలుస్తుంది. ఒకరిద్దరి కోసం డెఫిసిట్లతో షో వేయడం కంటే నిలిపివేయడం చాలా బెటర్ అని థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.


చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ 'యశ్‌ రాజ్‌ ఫిలిం' సంస్థ నిర్మించింది. భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ తో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది.ఆమెకు అయితే ఇక ఈ చిత్రం కోసం కోటి రూపాయల పారితోషికాన్ని కూడా చెల్లించారు. కరోనా వైరస్ కారణంగా చాలా సార్లు విడుదల వాయిదా వేసుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి వారం ఈ చిత్రం కేవలం రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. అక్షయ్ కుమార్ నటించిన సినిమాల్లో ఇంత ఘోరమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ కూడా ఇదే అని చెప్పాలి. ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ కూడా బాగా ఎక్కువగానే వచ్చాయి. డైరెక్ట్ గా ఓటీటీకి ఇచ్చుకున్నా ఈ సినిమా నిర్మాత సేఫ్ అయ్యి ఉండేవాడేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: