కమలహాసన్ భారతీయ సినిమా లెజెండ్ నటులలో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వెండితెరపై నటుడిగా తనదైన అసాధారణ ప్రదర్శనలతో కొన్ని షో లకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా 20 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ రికార్డులను సైతం సృష్టించారు. 60 ఏళ్ళ వయస్సులో కూడా కమల్ హాసన్ ఎంతో హుషారుగా నటిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోతున్నారు.
విక్రమ్ సినిమా తమిళనాడులోని 8 రోజులకు రూ. 110 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. బాహుబలి-2 సినిమా వచ్చి ఇప్పటికే 5 ఏళ్ల అవుతోంది.. ఈ రికార్డు ఎవరు కొట్టలేకపోయారు. దాదాపుగా ఈ చిత్రం తమిళనాడులోనే రూ. 155 కోట్ల రూపాయలను జీవిత కాల కలెక్షన్ గా సంపాదించింది. ఆ తర్వాత విజయ్ నటించిన బిగిల్ చిత్రం రూ.141 కోటి రూపాయలు సంపాదించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక నిన్నటి రోజున విక్రమ్ సినిమా దాదాపుగా రూ.130 కోట్ల రూపాయల మార్క్ ను అందుకునట్టుగా తమిళనాడులో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం నాల్గవ స్థానంలో ఉన్నది. ఇక నెమ్మదిగా అన్ని రికార్డులను తుడిపీ వేస్తూ తమిళనాడు లో మొదటి స్థానం చేరుకొని అత్యధిక వసూలు చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.