హీరో అడవి శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మేజర్. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర బృందానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేస్తూ ఒక లేఖ రాయడం కూడా జరిగింది. ముంబై నగరంలో 26 నవంబర్ 2008 ఉగ్రవాదులు జరిపిన ఒక మారణహోమం ఎంత దారుణంగా ఉన్నదో మనం ఊహించుకోవచ్చు ఆ సమయంలో కమాండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఉగ్రవాదుల చేతిలో మరణించడం కూడా జరిగింది.

ఇక ఆయన జీవిత కథను కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ శశికిరణ్. ఇక హీరో అడవి శేషు కూడా ఈ చిత్రంతో అభినందనలు వెలువడ్డాయి. ఇటువంటివారు సినీ పరిశ్రమకు మరింతమంది రావాలి దేశ భద్రత కోసం సైనికులు ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి త్వరలోనే ఈ సినిమా చూస్తాను చిత్రంలో నటించిన నటీనటులకు తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఒక లేఖను రాశారు. ఈ లేఖకు అడవి శేషు స్పందిస్తూ.. థాంక్యూ పవన్ కళ్యాణ్ మీ స్పందనతో మేజర్ టీమ్ చాలా ఆనందంగా ఉన్నది అని ట్వీట్ చేశారు.


ఇక  అడవి శేషు..థాంక్యూ పవన్ కళ్యాణ్ నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.. మీరు టూర్ తో బిజీగా ఉండడంతో మీరు మేజర్ సినిమా చూసే సమయం దొరుకుతుందో లేదో అని అనుకున్నాను కాని.. మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన ఈ రేఖ నిజంగానే మనసును తాకింది..సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ నా సర్వస్వంగా భావించి నటించాను ఆరోజు పంజా సినిమా ఈ రోజు మేజర్ మీ అభిమానానికి ధన్యుడిని అంటూ తన ట్విట్టర్లో తెలిపారు. ఇక ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి నిర్మాతగా మారిన మహేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: