మెగా మేనల్లుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సాయి ధరమ్ తేజ్ ఎన్నో రోజులు అవుతోంది. ఇప్పటికీ తన సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గత ఏడాది రిపబ్లిక్ సినిమా బాగానే ఆకట్టుకునప్పటికి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 1వ తేదీన గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సెప్టెంబర్ లో హీరో సాయి ధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ యాక్సిడెంట్ నుంచి ప్రత్యేకమైన చికిత్స చేయించుకొని బయట పడ్డారు.

ఇక ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరంతేజ్ తన 15 వ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా థ్రిల్లర్ మూవీ గా రూపొందించడం జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక గతంలో కంటే ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో హీరో సాయి ధరమ్ తేజ్సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. విలేజ్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక లొకేషన్ ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఇందులో డార్క్ చీకటిలో వెన్నెల వెలుతురు మధ్యలో సాయి ధరంతేజ్ సినిమా షూటింగ్ చేస్తున్న దృశ్యాన్ని గమనించవచ్చు. తాజాగా ఈ ఫోటో సినిమా మూడ్ ని తెలియజేస్తోంది. ఇక యంగ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు టైటిల్ ని ప్రకటించలేదు. SDT-15 అనే టైటిల్ వర్కింగ్ తో ఈ సినిమాను రూపొందించడం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించిన రోజే విడుదల చేసే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ను తయారు చేసినట్లుగా సమాచారం. మొదటిసారిగా ఇలాంటి జోన్ లో నటిస్తున్నాడు సాయి ధరంతేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: