ఇక ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరంతేజ్ తన 15 వ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా థ్రిల్లర్ మూవీ గా రూపొందించడం జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక గతంలో కంటే ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. విలేజ్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక లొకేషన్ ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఇందులో డార్క్ చీకటిలో వెన్నెల వెలుతురు మధ్యలో సాయి ధరంతేజ్ సినిమా షూటింగ్ చేస్తున్న దృశ్యాన్ని గమనించవచ్చు. తాజాగా ఈ ఫోటో సినిమా మూడ్ ని తెలియజేస్తోంది. ఇక యంగ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు టైటిల్ ని ప్రకటించలేదు. SDT-15 అనే టైటిల్ వర్కింగ్ తో ఈ సినిమాను రూపొందించడం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించిన రోజే విడుదల చేసే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ను తయారు చేసినట్లుగా సమాచారం. మొదటిసారిగా ఇలాంటి జోన్ లో నటిస్తున్నాడు సాయి ధరంతేజ్.