ఖైదీ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు లోకేష్. తొలి సినిమా ద్వారా ఆయన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ చిత్రంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ప్రేక్షకులను కూడా మరింతగా ఆకట్టుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.  ఆ విధంగా కమల్ హాసన్ తో కలిసి ఆయన చేసిన విక్రమ్ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడం తో విడుదలై పదిరోజులు అవుతున్న మంచి కలెక్షన్లు వస్తుండడంతో ఆయన కెరీర్లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హైలెట్ క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ అవడం కాగా ఈ చిత్రం తర్వాత చేసే సినిమా ద్వారా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు లోకేష్ . కార్తీతో కలిసి ఖైదీ రెండవ భాగం సినిమా చేస్తున్న లోకేష్ ఈ చిత్రంలో సూర్య కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్లుగా చెబుతున్నారు. 

అయితే ఇప్పుడు వరుస సినిమాల తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలీకృతం అయిన లోకేష్ తన స్క్రీన్ ప్లే బలంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పవచ్చు. విక్రమ్ సినిమాలో ఆయన రూపొందించిన స్క్రీన్ ప్లే నే ఇంతటి పెద్ద విజయాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. ఖైదీ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కూడా స్క్రీన్ ప్లే ను ఎంతో హృద్యంగా తీర్చిదిద్దడం తో ఆ సినిమా ఆయనకు సక్సెస్ ఫుల్ గా హిట్ ఇచ్చింది. ఇప్పుడు తన బలాన్ని మరొకసారి నమ్ముకుని విక్రమ్ సినిమా చేయగా అది కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు. మరి రాబోయే సినిమాల్లో లోకేష్ ఏ విధమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: