గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప
సినిమా విడుదల అయ్యి ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా ప్రేక్షకులు ఇంకా ఈ
సినిమా ను మరిచిపోలేకపోతున్నారు. ఈ సినిమాలోని పాటలను ఈ చిత్రంలోని డైలాగులను ఇంకా పలుకుతూ
సినిమా యొక్క క్రేజ్ ను ఇంకా ఇంకా తెలియ చేస్తున్నారు.
బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన పుష్ప
సినిమా దేశవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వసూలు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
విడుదల సమయంలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అంతటి స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ
సినిమా అంత త్వరగా మర్చిపోవడం అంటే జరగని పని. ముఖ్యంగా
బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అసలే మరిచిపోలేకపోతున్నారు కొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం గురించి ఇప్పటికీ కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం. ఆ విధంగా ఈ సినిమాపై పెరిగిన ఈ క్రేజ్ పుష్ప రెండో వభాగం యొక్క సినిమాపై కూడా ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ
సినిమా ఏ స్థాయిలో ఉందో చూడాలి.
వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని
అల్లు అర్జున్ భావిస్తున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో
రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
అల్లు అర్జున్ స్వయంగా ఈ
సినిమా యొక్క స్క్రిప్ట్ పనుల్లో భాగం అవుతూ ఉండగా నార్త్ ప్రేక్షకులు మొదటి భాగాన్ని బాగా ఆదరించిన నేపథ్యం లో ఈ సినిమాను వారికి మరింత బాగా నచ్చే విధంగా తీర్చిదిద్ద పోతున్నారు. అందుకే ఈ
సినిమా యొక్క ప్రీప్రొడక్షన్ పనులకు ఎంత సమయం తీసుకున్నారు మేకర్స్.