మెగాస్టార్
చిరంజీవి తో
సినిమా చేయడం అంత సులువు కాదు కానీ అది గతంలో.. ఇప్పుడు ఆయనతో
సినిమా చేయడం ఎంతో బిజీ అనేస్తున్నారు కొంత మంది దర్శకులు. కథ బాగా ఉండి చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే తప్పకుండా
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి దర్శకుడైన ఓకే చెప్పేస్తున్నాడు అనే వార్త
టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేస్తున్న తదుపరి సినిమాలతో మరొకసారి కం బ్యాక్ చేయాలని ఆయన భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను తదుపరి విడుదల చేయనున్నాడు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా తప్పకుండా ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటుందని చెబుతున్నారు. ఇకపోతే
మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ
సినిమా తెరకెక్కుతోంది. భోళా
శంకర్ అనే పేరుతో తెరకెక్కిన ఈ
సినిమా లో
తమన్నా కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రం కూడా ఇపుడు విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ వ్యవధి లోనే విడుదల అవుతూ ఉంటాయి అని మెగా అభిమానులు భావిస్తున్నారు .
ఆ విధంగా రెండు సినిమాలను రెడీ చేసిన
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు
బాబీ దర్శకత్వంలోని సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలో ఈ మూడు సినిమాలను పూర్తి చేసి
మెగాస్టార్ చిరంజీవి మరికొంత మంది
యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నాడు. త్వరలోనే
వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ
సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు అని అంటున్నారు. మరి చిరు ఇంకా ఎవరెవరితో
సినిమా లు ఓకే చేసుకున్నాడో చూడాలి. అయన ఎక్కువగా
యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.