బాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ తాజాగా సామ్రాట్ పృథ్విరాజ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే.

మూవీ లో అక్షయ్ కుమార్ సరసన మనుషి చిల్లర్ కథానాయికగా నటించగా, సంజయ్ దత్ , సోనూ సూద్ ఈ మూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లో విడుదల అయిన సామ్రాట్ పృథ్వి రాజ్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలా బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు రోజురోజుకు తగ్గుతూ వచ్చాయి. ఈ సినిమాలో vfx అధికంగా ఉండడంతో ఈ మూవీ కి దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో కే నెగిటివ్ టాక్ రావడం,  ఆ తర్వాత నుండి ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూ రావడంతో ఇప్పటి వరకు కేవలం 50 వరకు మాత్రమే కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 50 కోట్ల కలెక్షన్లను మాత్రమే వెనక్కు తేవడంతో ఈ సినిమాకు భారీ రేంజ్ లో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ రన్ లో ఈ మూవీ ఎ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: