ఇక మహానటి సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైన కీర్తి సురేష్ ఆ తర్వాత మెల్లగా అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ తన స్టార్ హోదాను బాగా పెంచుకుంటోంది.అలాగే ఎక్కువగా గ్లామరస్ పాత్రలో కనిపించకుండా వీలైనంత వరకు కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ ఒక పోస్ట్ వెడ్డింగ్ టూర్ లో దర్శనమిచ్చింది. అందమైన కేరళ ప్రదేశాల్లో ఆమె ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.ఇక గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే కేరళ టూరిజం లో ఆమె తన సన్నిహితులతో కలిసి పోస్ట్ వెడ్డింగ్ బాష్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు గా కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో కీర్తి సురేష్ గ్లామర్ తో అలాగే మరొక ఫోటోలు మాత్రం ట్రెడిషనల్ లుక్ తో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే ఒకవైపు మోడ్రన్ గా ఉంటూనే మరొక వైపు ఆమె సింపుల్ గా మంచి ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోంది.


ఇక అన్ని రకాల పాత్రలు చేస్తున్న కీర్తి సురేష్ ఇటీవలకాలంలో అగ్రహీరోలతో నటించేందుకు కాస్త గ్లామర్ డోసు కూడా బాగా పెంచుతోంది అనే చెప్పాలి. మహానటి తో మంచి నటిగా మంచి క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ పై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే మంచి గౌరవం ఏర్పడింది. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే ఆమె అవకాశాల కోసం గ్లామరస్ పాత్రలు చేస్తే బాగుండు అని కొంత గ్యాప్ తీసుకొని మహానటి వాతావరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ కు గ్లామర్ తో సరికొత్తగా ఇస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల సర్కారు వారి పాట సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న కీర్తిసురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో బోళా శంకర్ సినిమాలో కూడా చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఇంకా చర్చల దశలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: