‘ప్రతిరోజు పండగే’ మూవీ తరువాత సాయి ధరమ్ తేజ్ కెరియర్ అనేక అనుకోని మలుపులు తీసుకుంది. కరోనా వేవ్ లు వల్ల తేజ్ నటించవలసి ఉన్న కొన్ని సినిమాలు ప్రారంభం కాలేదు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత తేజ్ తన సినిమాలను మొదలుపెడతాడు అని అనుకుంటున్నా సమయంలో అతడికి జరిగిన పెద్ద యాక్సిడెంట్ తో తేజ్ కెరియర్ మరింత గందరగోళంలో పడిపోయింది.



చివరకు అతడు కోలుకున్నప్పటికీ ఇంకా అతడికి దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడు సుకుమార్ శిష్యుడు దండు కార్తీక్ దర్శకత్వంలో ఒక హారర్ మూవీ చేస్తున్నాడు. సుకుమార్ స్వయంగా ఈమూవీకి స్క్రీన్ ప్లే అందించడంతో ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగాయి.


‘రుద్రవనం’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలోని రుద్రవనం ఊరిలో ఊహించని విధంగా హత్యలు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఈవిషయాల పై పరిశోధన చేయడానికి వచ్చిన సిబీఐ ఆఫీసర్ గా తేజ్ నటిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే ఈమూవీ రీ షూటింగ్ మళ్ళీ జరుగుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.


దీనికికారణం తేజ్ నటించిన సీన్స్ కొన్ని సరిగ్గా రాలేదని అతడు క్రితంలా యాక్టివ్ గా షూటింగ్ సమయంలో ఉండటం లేదనీ అదేవిధంగా ఫైట్స్ చేసే విషయంలో కూడ కొద్దిగా అలిసిపోతున్నాడు అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. దీనితో తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికితోడు ఈమధ్య చిరంజీవి ఇంటికి సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ లు వచ్చిన సందర్బంలో జరిగిన పార్టీకి తేజ్ కూడ వచ్చాడు. ఆ పార్టీకి సంబంధించి బయటకు లీక్ అయిన ఫోటోలలో తేజ్ గతంలో లా ఉత్సాహంగా కనిపించకపోవడంతో అతడి అభిమానులు చాలామంది తేజ్ ఎందుకు ఇలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: