తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా.. 'పక్కా కమర్షియల్'.అయితే మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.కాగా  గోపిచంద్ నటిస్తున్న ఈ సినిమా  జూలై 1న విడుదల కాబోతోంది.ఇక ఈ సినిమాకి సబందించిన ప్రమోషన్లు నెలరోజుల ముందు నుండే మొదలుపెట్టారు చిత్ర బృందం.అయితే ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు ఎక్కువగా పెంచేయడంతో జనాలు థియేటర్లకు రావడం లేదు.  అంతేకాదు...పైగా ఓటీటీలో 3,4 వారాలకే సినిమాలు రిలీజ్ అయిపోతాయి అని ఫిక్స్ అయిపోయారు. 

ఇక దీంతో 'పక్కా కమర్షియల్' ప్రమోషన్ల విషయంలో పదే పదే ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు మేకర్స్.వారు మాట్లాడుతూ...టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 కే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ అనిపించింది. ఇక ఈ సినిమాలోని రెండు పాటలకి మంచి స్పందన లభించింది. అయితే ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆశించని కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి.పొతే...అదేంటి అంటే ఈ చిత్రంలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారట.అంతేకాదు  చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ కొంచెం పేరున్న నటీమణులను ఈ పాత్రలకి ఎంపిక చేసుకున్నారట చిత్ర యూనిట్.

అయితే...సినిమా క్లయిమాక్స్ ముందు సీన్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంటర్ అవుతుందట. అంతేకాకుండా దాని తర్వాత అదితి గౌతమ్ అనే మరో హీరోయిన్ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుందట. ఇకపోతే  మరో హీరోయిన్ చిత్రా శుక్లా ఓ చిన్న పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. ఆ అంతేకాదు వీళ్ళ పాత్రలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. ఇక మిడ్ రేంజ్ సినిమాలని కూడా స్టార్ హీరోల సినిమాల మాదిరిగా ఎలా తీర్చిదిద్దాలో బన్నీ వాస్, మారుతీ లకి బాగా తెలుసు.ఇదిలావుంటే 'గీత గోవిందం' సినిమాలో నిత్యా మేనన్, మరోవైపు...అను ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్లు ఇలాగే చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తారు.ఇక మన  బన్నీ వాస్ ఆ చిత్రానికి నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: