ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాడూరి డైరక్షన్ లో వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ భామ కెతిక శర్మ. ఆ సినిమాలో తన అందాలతో రెచ్చిపోయిన ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య లక్ష్య సినిమా లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ లీడ్ రోల్ లో వస్తున్న రంగ రంగ వైభవంగా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్య డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటుగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట కెతిక శర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ తమిళ రీమేక్ మూవీలో నటిస్తున్నారని తెలిసిందే. వినోదయ సీతం అనే తమిళ సినిమా రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా మాత్రుక దర్శకుడు నటుడు సముద్ర ఖని అవడం విశేషం. ఆయనే ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ సినిమా లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. పవన్, సాయి ధరం తేజ్ కలిసి నటించే ఈ మెగా మల్టీస్టారర్ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

సీనిమాలో కెతిక శర్మ సాయి తేజ్ కి జోడీగా సెలెక్ట్ అయ్యినని తెలుస్తుంది. రంగ రంగ వైభవంగా సినిమాలో తమ్ముడి తో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ వినోదయ సీతం సినిమాలో అన్నతో జోడీ కడుతుంది. ఈ సినిమాలో కెతిక శర్మ ఛాన్స్ నిజంగానే చాలా లక్కీ అని చెప్పొచ్చు. తప్పకుండా కెతిక శర్మకు ఈ అవకాశం ఆమె కెరియర్ కు ప్లస్ అవుతుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: