బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యాం రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచాయని చెప్పొచ్చు. నార్త్ లో బాహుబలి మేనియాతో ఈ రెండు సినిమాలు జస్ట్ ఓకే అనిపించాయి కానీ ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ కొడితే ఎలా ఉంటుంది అన్నది చూడాలని ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతున్నాడు.

కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది. సినిమా కె.జి.ఎఫ్ ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సలార్ తో ప్రభాస్ ఖచ్చుఇతంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. లేదంటే మాత్రం ప్రభాస్ మళ్లీ కెరియర్ లో వెనకపడే అవకాశం ఉంది. అయితే సలార్ తర్వాత కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లే ఉన్నాయి.

ఆఫ్టర్ సలార్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న ప్రభాస్ దానితో పాటుగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె వస్తుంది. దానితో పటుగా  అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ డైరక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్ని అనుకున్న విధంగా టార్గెట్ రీచ్ అయితే ప్రభాస్ మార్కెట్ ని అందుకోవడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాల గురించి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ప్రభాస్ బాక్సాఫీస్ రాజుగా నిలబడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఒకదానికిమించి మరొక సినిమాతో ప్రభాస్ ప్రతి సినిమా అదరగొట్టబోతుంది అనేలా చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిని కాలర్ ఎగురవేసుకునేలా చేస్తాయని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: