ఈవారం విడుదలకాబోతున్న ‘విరాటపర్వం’ చాల డిఫరెంట్ మూవీ. నక్సల్ బ్యాక్ డ్రాప్ తో ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని నిర్మాణం జరుపుకున్న ఈమూవీని చాల సహజసిద్ధంగా తీసారు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీలో వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి క్రేజ్ ఈమూవీ తరువాత మరింత పెరగడమే కాకుండా ఈమూవీలోని ఆమె నటనకు అవార్డులు కూడ వస్తాయని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.



వాస్తవానికి ఈమూవీకి అనేక ప్రముఖ ఓటీటీ సంస్థల నుండి భారీ ఆహర్లు వస్తున్నప్పటికీ ఈమూవీని ధియేటర్లలోనే విడుదలచేయాలి అన్న రానా పట్టుదలహో ఈమూవీని ఈవారం విడుదలచేస్తున్నారు. ఈమూవీకి పోటీగా మరొక మూవీ ఏదీ విడుదల అవ్వడంలేదు. దీనితో ఈమూవీ కలక్షన్స్ కు ఎదురు ఉండదు అన్నఅంచనాలు ఉన్నప్పటికీ నేటితరం ప్రేక్షకులు నక్సల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను చూసి ఆదరిస్తారా అన్నసందేహాలు కొందరికి ఉన్నాయి.


దీనితో ఈమూవీ ప్రమోషన్ ను చాలఎక్కువగా చేయడమే కాకుండా ఈమూవీ విడుదల ముందే కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా షోలు వేయించి వారికి చూపెడుతున్నారు. ఈవిషయంలో రానా చాల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పటికే ఈమూవీని త్రివిక్రమ్ సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్శకులతో పాటు అనేకమంది యంగ్ హీరోలకు కూడ రానా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమా స్పెషల్ షోలకు వచ్చిన ప్రముఖులు మాత్రం రానా ముందు ఈసినిమా చాల అద్భుతం అనీ ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ వారంతా తమ ఇళ్ళకు వెళ్ళిన తరువాత తమను కలిసిన సన్నిహితులతో ఇలాంటి వాస్తవ కథలను ప్రేక్షకులు చూస్తారా అన్నసందేహాలు వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది.


అంతేకాదు ఈమూవీ స్పెషల్ షోలను చూసిన తరువాత ఒక్క నిఖిల్ తప్ప ఎవరు ఓపెన్ గా సోషల్ మీడియా ద్వారా ఈమూవీ పై ప్రశంసలు కురిపించలేదు. దీనితో వీరంతా ఈమూవీ విడుదలైన తరువాత ఆమూవీకి వచ్చిన ఫలితాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు స్పందిస్తారా లేదంటే ఇదే మౌనాన్ని కొనసాగిస్తారా అన్నసందేహాలు కూడ ఉన్నాయి. రానాకు అత్యంత సన్నిహితుడైన రాజమౌళి కూడ ఈమూవీ స్పెషల్ షోలను ఇప్పటివరకు చూసాడా లేదా అన్న విషయం పై క్లారిటీ లేదు. దీనితో ఈమూవీకి వచ్చిన భారీ ఓటీటీ ఆఫర్లను వదులుకుని ఈమూవీని డైరెక్ట్ గా ధియేటర్లలో రిలీజ్ చేస్తూ రానా సాహసం చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: